ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, లోక్సభ సభ్యుడు అఖిలేష్ యాదవ్ మర్యాద పూర్వకంగా కలిశారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన అఖిలేష్ యాదవ్ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి తో కొద్దిసేపు సమావేశమయ్యారు.
. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి గారు వివరించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ గారితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.

